న్యూ ఢిల్లీ :మార్చి 22
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురయింది.

తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను క్వాష్ చేయాలని, బెయి ల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ ను నిరాక రించింది.సుప్రీంకోర్టు ధర్మాసనం… ఆమెకు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది.

పిటిషనర్ ఎవరైనా సరే తాము ఏకరీతి విధానాన్ని అనుసరిస్తామని ఈ సంద ర్భంగా ధర్మాసనం వ్యాఖ్యా నించింది. బెయిల్ కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని తాము అంగీకరించబోమని తెలిపింది.

బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సూచిం చింది. ఎవరైనా సరే బెయిల్ కోసం తొలుత కింది కోర్టుకే వెళ్లాలని స్పష్టం చేసింది. తన అరెస్ట్ చట్ట విరుద్ధ మంటూ రాజ్యాంగ ఉల్లం ఘనలకు సంబంధించి కవిత లేవనెత్తిన అంశా లను… గతంలో విజయ్ మదన్ లాల్ కేసుకు ధర్మాసనం జత చేసింది.

కేవలం రాజ్యాంగ ఉల్లం ఘనలకు సంబంధించిన అంశాలపై మాత్రమే విచా రణ జరుపుతామని తెలి పింది. ఇదే విషయంపై దాఖలైన మరో పిటిషన్ తో కలిసి విచారిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.

పిటిషన్ లోని అంశాలపై ఈడీకి నోటీసులు ఇస్తా మన్న ధర్మాసనం… ఈడీకి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం కేసు మెరిట్స్ లోకి వెళ్లబోమని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టులో కవిత తరపున ప్రముఖ సీనియర్ న్యాయవాది, రాజకీయవేత్త కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.