కామారెడ్డి రైతు జేఏసీ బృందం శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావును కలిసింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనపై వారు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. ఇప్పటికే రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ తెలిపిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. మరోసారి డీటీసీపీ అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం అమలులో ఉన్న పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని సూచించారు.