‘గుంటూరు కారం’కు సంబంధించి వైరల్ అవుతున్న వార్తల్లో మొదటిది మ్యూజిక్ డైరెక్టర్కి సంబంధించింది. తమన్ను ఈ సినిమా నుంచి తీసేశారు. ఆయన స్థానంలో కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ రాబోతున్నారని టాక్. అయితే ఈ వార్తలపై అదే రేంజ్లో రివర్స్ ఎటాక్ చేశారు తమన్. కడుపు మంటకు అరటిపళ్లు తినాలంటూ సెటైరికల్గా కామెంట్స్ చేశారు. అలాగే ఇప్పుడు ఇదే సినిమాకు సంబంధించి మరో న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమా నుంచి పూజా హెగ్డేను కూడా పక్కకు పెట్టేశారని. ఆమె స్థానంలో కోలీవుడ్ హీరోయిన్ త్రిషను తీసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై పూజా హెగ్డే స్పందిస్తే అది అబద్ధం అవుతుంది. ఆమె సైలెంట్గా ఉంటే మాత్రం నిజమనే అందరూ అనుకుంటారనటంలో సందేహం లేదు.‘గుంటూరు కారం’పై ఇన్ని రూమర్స్ రావటంపై ప్యాన్స్ కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్.. త్రివిక్రమ్ను టార్గెట్ చేశారు. అసలు సినిమా అయినా ఉందా లేక అటకెక్కించేశావా? అని ఆయన పేరుని ప్రస్తావించకుండా ఇన్ డైరెక్టర్గా కామెంట్స్ చేయటం వైరల్ అయ్యింది. ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్ను టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ ట్వీట్స్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా తనదైన శైలిలో సెటైరికల్ ట్వీట్ చేయటం విశేషం.