ఏపీలో వాలంటీర్ల అంశంలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వాలంటీర్లకు రూ.10 వేల వేతనం ఇస్తామని చంద్రబాబు హామీ ఇస్తుండగా, వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. చంద్రబాబు మాటలు నమ్మొద్దని, గతంలోనూ చంద్రబాబు ఇలాంటి మోసపూరిత హామీలు ఇచ్చారని సజ్జల ధ్వజమెత్తారు. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. 

వాలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామంటే సజ్జలకు ఏంటి నొప్పి? అని ప్రశ్నించారు. వాలంటీర్లకు మేలు చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని, అందులో సజ్జల తప్పుబట్టాల్సింది ఏముంది? అని వర్ల రామయ్య ధ్వజమెత్తారు. వాలంటీర్లను మీరు బానిసల మాదిరిగా వాడుకున్నారని ఆరోపించారు.