ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జైలు పాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో మళ్ళీ నిరాశే ఎదురైంది. బెయిల్ కోసం ఆమె దాఖలు చేసుకున్న రెండు పిటిషన్లను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు కొట్టేసింది. కవితకు బెయిల్ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. సోమవారం ఉదయం తీర్పు వెలువరిస్తూ.. కవితకు బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. అయితే ఎలాంటి ఆధారాలు లేకున్నా తన క్లయింట్ కవితను అక్రమంగా అరెస్టు చేశారని కవిత లాయర్ వాదించారు. ఈ వాదనను రౌస్ ఎవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. ఈడీ దాఖలు చేసిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుతో పాటు లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్ ఆరోపణలపై సీబీఐ దాఖలు చేసిన కేసుతో కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. అంతకుముందు తనను ప్రత్యక్షంగా కోర్టులో హాజరు పరచాలంటూ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్ నూ కోర్టు తోసిపుచ్చింది. కవిత ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో కవిత బెయిల్‌ పిటిషన్లను తిరస్కరిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆమెకు బెయిల్ నిరాకరిస్తూ తుది తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం తిహార్ జైలులో జుడిషియల్‌ కస్టడీలో ఉన్న కవిత తాను బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌నని.. అందుకే తాను ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని కోర్టుకు వివరించింది . మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్‌కు అర్హత ఉందని తెలిపింది ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారని కవిత న్యాయవాది వాదనలు వినిపించారు. అరెస్టుకు సరైన కారణాలు లేవని న్యాయస్థానానికి చెప్పారు. అయితే మరోవైపు సీబీఐ, ఈడీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వొద్దని, మద్యం కేసులో కవితే కీలక సూత్రధారి, పాత్రధారి అని మరోసారి కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.