పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ 18 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను తాజాగా అధికారికంగా ప్రకటించింది. బీజేపీ, టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకు పరిమితం అయిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో ఆయా స్థానాలకు టికెట్లు ప్రకటించారు. అయితే, అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ స్థానాలకు మాత్రం జనసేన అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టింది. తాజాగా ప్రకటించిన జనసేన అసెంబ్లీ అభ్యర్థుల వివరాల్లోకి వెళ్తే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ , రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ లు బరిలోకి దిగనున్నాను ఇక తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ ,పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, యలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్ , పి.గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ, రాజోలు నుంచి దేవ వరప్రసాద్ పోటీలో ఉన్నారు. ఇక తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం నుంచి పులపర్తి ఆంజనేయులు, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు, పోలవరం నుంచి చిర్రి బలరాజు ,తిరుపతి నుంచి అరణి శ్రీనివాసులు , రైల్వే కోడూరు నుంచి డాక్టర్ యనమల భాస్కరరావు బరిలో నిలవనున్నారు. ఇది ఇలావుండగా ఆదివారం నాడు బీజేపీ 111 మంది ఎంపీ అభ్యర్థులతో జాబితా విడుదల చేసింది. ఇక ఏపీ బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల విషయానికి వస్తే అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమహేంద్రవరం నుంచి పురంధేశ్వరి, నర్సాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస శర్మ, తిరుపతి నుంచి వరప్రసాదరావు , రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి లు బరిలో దిగనున్నారు.