జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీడియాలో వస్తున్న అవినీతి అంశాలపై ఏసీబీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల బదిలీల్లో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని అన్నారు. 

ఏసీబీ టోల్ ఫ్రీ నెంబరు 14400కి 8.03 లక్షల ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. మంత్రులపైనా, వారి కార్యాలయాలపైనా 2.06 లక్షల అవినీతి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఎమ్మెల్యేలపై 4.39 లక్షల ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఈ ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.