బీఆర్ఎస్ ముమ్మాటికీ సెక్యులర్ పార్టీ అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బుధవారం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల హవానే ఉంటుందన్నారు. ఈ జాతీయ పార్టీల హవా కనిపించదన్నారు. 2024 తర్వాత దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, ఏకపార్టీ ప్రభుత్వం రాదని జోస్యం చెప్పారు.
లోక్ సభ ఎన్నికల్లో అన్ని ఎంపీ స్థానాలను మనం గెలుచుకుంటే బీఆర్ఎస్ తడాఖా అప్పుడు ఢిల్లీలో చూపిద్దామన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నామన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు.. అనే తేడా లేకుండా అన్ని మతాల ప్రజలను కలుపుకొని పోతున్నామన్నారు. అందర్నీ సమానంగా ఆదరిస్తున్నామన్నారు. ప్రతి పథకంలో అందరూ భాగస్వామ్యం అవుతున్నారన్నారు. అన్ని మతాల వారిని సమానంగా చూస్తున్నామన్నారు.