వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బూతుల ఎమ్మెల్యేకి పోలవరం అంటే ఏమిటో తెలియదని, పట్టిసీమ అంటే ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. టిడ్కో ఇళ్లను చంద్రబాబు కట్టిస్తే… ఆ కాలనీకి రాజశేఖరరెడ్డి పేరు పెట్టిన వ్యక్తి కొడాలి నాని అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో నానిని తరిమి కొట్టాలని అన్నారు. రేపు మల్లాయపాలెంలో ‘రా.. కదలిరా’ బహిరంగసభ జరగనుంది. ఈ సభ ఏర్పాట్లను బూరగడ్డ వేదవ్యాస్ తో కలిసి దేవినేని ఉమా పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు కొడాలి నాని తగిన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. ప్రజాస్వామ్యంపై నానికి నమ్మకం లేదని విమర్శించారు.