టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈరోజు సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు, విజయవాడ ఏసీబీ కోర్టుల్లో తీవ్ర నిరాశ ఎదురయింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారించింది. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుతో పాటు నారా లోకేశ్, మాజీ మంత్రి పి.నారాయణ తదితరులు కూడా నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో నారా లోకేశ్ కూడా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

Previous articleమహాగణపతి నిమజ్జనానికి భాగ్యనగరం ముస్తాబు.. రాత్రంతా తిరగనున్న ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు, బస్సులు
Next articleఅత్యాచారాలు, హత్యలపై ఎందుకు స్పందించడం లేదు?.. ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ మండిపాటు