ఏపీ సీఎం జగన్ పాలనను టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు ఎండగట్టారు. బుధవారం మంగళగిరిలో ఎన్టీఆర్ భవన్‌ వేదికగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేదని, రాష్ట్రానికి ఎవరు రావాలన్నా భయపడుతున్నారని అన్నారు. రిషి కొండ లాంటి చారిత్రక కొండను తవ్వి ప్యాలెస్ కట్టుకున్నాడని విమర్శించారు. రాష్ట్రానికి సీఎంగా జగన్ శాశ్వతంగా ఉంటాడా అని విమర్శించారు.