రాజమండ్రి సెంట్రల్‌ జైలు సాక్షిగా టీడీపీ, జనసేన పొత్తు పొడిచింది. జైలు బయట జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. పొత్తును కన్ఫామ్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. తాము కలిసి వెళ్తేనే వైసీపీ దౌర్జన్యాలను ఎదుర్కోగలమని చెప్పారు.

రాజమండ్రి సెంట్రల్‌ జైలు సాక్షిగా టీడీపీ, జనసేన పొత్తు పొడిచింది. జైలు బయట జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. పొత్తును కన్ఫామ్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. తాము కలిసి వెళ్తేనే వైసీపీ దౌర్జన్యాలను ఎదుర్కోగలమని చెప్పారు. విడివిడిగా పోటీ చేస్తే ఎదుర్కోలేమని చెప్పుకొచ్చారు. వైసీపీని సమష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందన్న పవన్.. తాము అధికారంలోకి వచ్చాక.. వైసీపీకి మద్దతిచ్చే ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇది వైసీపీ నేతలు, కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలని ఆయన మండిపడ్డారు.