వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా తన స్థానంలో మరో వ్యక్తికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారని…. పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని తమ అధినేత చంద్రబాబు ఆదేశించారని ఎంపీ కేశినేని నాని తెలిపిన సంగతి తెలిసిందే. తమ అధినేత ఆదేశాలను శిరసావహిస్తానని కూడా ఆయన చెప్పారు. 

ఈ నేపథ్యంలో నాని సోదరుడు కేశినేని చిన్ని స్పందిస్తూ… కేశినేని నాని ఫేస్ బుక్ పోస్టుతో తనకు సంబంధం లేదని చెప్పారు. కుటుంబంలో కలహాలు ఉండటం సహజమేనని అన్నారు. చంద్రబాబును మళ్లీ సీఎం చేయడమే తన ధ్యేయమని చెప్పారు. ప్రస్తుతం తమ దృష్టి మొత్తం తిరువూరు సభను విజయవంతం చేయడంపైనే ఉందని అన్నారు. తిరువూరు సభకు లక్షకు పైగా పార్టీ శ్రేణులు, అభిమానులు వస్తారని తెలిపారు. టీడీపీలో తాను ఒక సామాన్య కార్యకర్తను మాత్రమేనని చెప్పారు