టీ20 వరల్డ్ కప్ సన్నాహాల్లో భాగంగా టీమిండియా నేడు బంగ్లాదేశ్ తో వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. అమెరికాలోని న్యూయార్క్ నగరం ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది. ఇక్కడి నాసావ్ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది. 

ఒకటిన్నర ఏడాది విరామం తర్వాత జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ అర్థసెంచరీతో రాణించడం సానుకూల అంశం. పంత్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. చివర్లో హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడి 23 బంతుల్లో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పాండ్యా స్కోరులో 2 ఫోర్లు, 4 సిక్సులున్నాయి.