తెలంగాణలో ఫోన్ టాపింగ్ వ్యవహరం ఇటు రాజకీయం అటు సినీ రంగాల్లో ఎంత సంచలనం సృష్టిస్తుందో తెలిసిందే. అయితే తాజాగా మరికొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే కొంత మంది పోలీసు ఉన్నతాధికారులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. సిట్ సంస్థ దీనిపై, దర్యాప్తు వేగం పెంచింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రేవంత్ రెడ్డి కదలికలపై దాదాపు 25 మంది స్పెషల్ టీంతో 24 గంటలు నిఘా పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా నియమించినప్పటి నుండి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్టు సిట్ అధికారులు గుర్తించారు. అదే విధంగా .. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు.. ఎవరెవరిని కలుస్తున్నారో తెలుసుకొని వివరాలు కేసీఆర్ కు ప్రణీత్ రావు టీమ్ అందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ నిఘాలో కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్సియల్ సోర్స్ ఎవరు అందిస్తున్నారోఅనే దానిపై నిరంతరం నిఘా పెట్టేవారు. అంతేకాకుండా.. నిరంతం వారి సమాచారం తెలుసుకొని కేసీఆర్ కు ఇస్తుండేవారని బైటపడింది. ఈక్రమంలో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని గులాబీ పార్టీ పెద్దలకు నివేదించారని సిట్ దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ మారడంతో ఈటేల రాజేందర్ పై కూడా 24 గంటలు నిఘా పెట్టినట్టు సమాచారం. ఈటెల ఎక్కడికి వెళ్తున్నారు.. ఎవర్ని కలుస్తున్నారు.. ఆయన టచ్ లో ఉన్నపార్టీనేతలపై కూడా నిరంతరం నిఘాను ఉంచినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఫోన్ వ్యవహరంను మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. రాజకీయ నాయకులు, అధికారుల ఫోన్ టాపింగ్ వ్యవహరంపై సీరియస్ గా దర్యాప్తు చేపట్టాలని, దీని వెనుక ఎలాంటి వారున్న అందర్ని బైటకు లాగి అరెస్టు చేసి జైలుకు తరలిస్తామని రేవంత్ అన్నారు.