తమిళ సినిమాల్లోనే కాకుండా తెలుగులో కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. తాజాగా ఆయనకు అరుదైన గౌరవం లభించింది. యూఏఈ సాంస్కృతిక, పర్యాటక శాఖ రజనీని గోల్డెన్ వీసాతో సత్కరించింది . అబుదాబీలో జరిగిన కార్యక్రమంలో డీటీసీ చైర్మన్ మహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ గోల్డెన్ వీసా కార్డును రజనీకి అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మలయాళీ వ్యాపారవేత్త, లులు మాల్ సీఎండీ ఎంఏ యూసుఫ్ అలీ పాల్గొన్నారు. ఈ క్రమంలో రజనీ కాంత్ తన ‘ఎక్స్’ ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు. ‘అబుధాబీ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక గోల్డెన్ వీసా అందుకోవడాన్నిగౌరవంగా భావిస్తున్నానని . ఇందుకుగాను అబుధాబీ ప్రభుత్వానికి, దాన్ని పొందడంలో సహకరించిన తన స్నేహితుడు, లులు గ్రూప్ సీఎండీ యూసుఫ్ అలీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని రజనీ పేర్కొన్నారు.. ‘తలైవా’కు లభించిన గౌరవానికి ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల యూఏఈ సందర్శన సందర్భంగా రజనీకాంత్ లులు గ్రూప్ సీఎండీ యూసుఫ్ అలీతోపాటు ఆ సంస్థ ప్రతినిధులను కలిశారు. . ఈ గోల్డెన్ వీసా కార్డ్ యూఏఈలో విదేశీయులు పనిచేసేందుకు, నివసించేందుకు, చదువుకొనేందుకు, . పెట్టుబడిదారులకు , వ్యాపారవేత్తలకు , వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపిన వారికి మంజూరు చేస్తారు. దీర్ఘకాలంపాటు యూఏఈలో ఉండాలనుకొనే వారికి అందిస్తారు. ఈ వీసా కాలవ్యవధి ఐదు నుంచి పదేళ్ల మధ్య ఉంటుంది. కాలవ్యవధి ముగిశాక మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు. యూఏఈలో చేసే వ్యాపారాలపై పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు గోల్డెన్ వీసాదారులకు లభిస్తాయి. ఇది 6 నెలల ఎంట్రీ వీసాగా పనిచేయడంతోపాటు యూఏఈని ఎన్నిసార్లయినా సందర్శించే వెసులుబాటు అందిస్తుంది. కుటుంబ సభ్యులందరితోపాటు ఎంత మంది పనిమనుషులనైనా స్పాన్సర్ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ గోల్డెన్ వీసా పొందటం పై రజిని అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు