ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎవరు గెలుస్తారు అని అడిగితే.. ఏ పార్టీ వారైనా తమ పార్టే గెలుస్తుందని చెప్తారు. అయితే ఈ విషయంలో కొన్ని సంస్థలు జనాలతో సర్వేలు నిర్వహిస్తుంటాయి. ఈ సందర్బంగా ఇప్పుడు ఒక సర్వే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది ప్రీ-పోల్ సర్వేగా చెబుతున్నారు. ఈ సర్వేని ఏపీలోని 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో జరిపినట్లు తెలిపారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో.. ప్రతీ స్థానంలో 5000 క్వాలిటీ శాంపిల్స్ తీసుకున్న ఈ సర్వేలో కొన్ని అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టైన తర్వాత టీడీపీ వేప్.. అండర్ కరెంట్ లాగా ఏపీ అంతటా పాకిందని, ఏపీలో సీఎం జగన్‌కి వ్యతిరేక వేవ్ వచ్చిందనీ. తెలిపారు. ఈ సర్వే ప్రకారం టీడీపీ కూటమికి 52 శాతం, వైసీపీకి 40 శాతం ఓట్లు వస్తాయని తెలిపారు. కొత్త ఓటర్లు, యువ ఓటర్లు ఈసారి కూటమివైపు మొగ్గు చూపుతున్నట్టు సర్వేలో తెలిపారు. అదే సమయంలో పెద్దవారు, ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నవారు మాత్రమే వైసీపీకే ఓటు వెయ్యాలనుకుంటున్నారని తెలిపారు. వైసీపీపై ఉద్యోగులు, నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనీ, బిజినెస్ కమ్యూనిటీ కూడా ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నట్టు సర్వేలో ఇచ్చారు. చంద్రబాబు తమ కూటమి మేనిఫెస్టోని విడుదల చేసిన తర్వాత.. టీడీపీ వేవ్ మరింత పెరిగిందన్నారు . ఉచిత బస్సు ప్రయాణం, మూడు ఉచిత సిలిండర్ల పథకాలు.. మహిళా ఓటర్లను ఆకర్షిస్తున్నాయనీ.. అలాగే.. ఏపీలో తాగు నీటి సమస్య బాగా ఉండగా.. ప్రతీ ఇంటికీ వాటర్ ట్యాప్ వేయిస్తామని కూటమి ఇచ్చిన హామీ ప్రభావం చూపిస్తోందని సర్వేలో తెలిపారు. ప్రజల్లో ఎంతో హైప్ కలిగివున్న వైసీపీ మేనిఫెస్టో… రిలీజ్ అయ్యాక.. ఆ హైప్‌ని అందుకోవడంలో ఫెయిలైందనీ.. కొత్త పథకాలు లేకపోవడం ఆసక్తిని పోగొట్టిందని తెలిపారు. ఏపీలో అభివృద్ధి ఆశించిన స్థాయిలో కనిపించకపోవడం, రోడ్లు సరిగా లేకపోవడం వంటి అంశాలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయనీ.. ఇది ఎలక్షన్స్ రిజల్ట్ లో కనిపిస్తుందని తెలిపారు. ఈ సర్వే మొత్తం 219 పేజీలతో ఉంది. ఈ సర్వే ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తుందో కూడా పూర్తి వివరాలు ఇచ్చారు