Home Telangana కాంగ్రెస్‌లోకి జూపల్లి,పొంగులేటి

కాంగ్రెస్‌లోకి జూపల్లి,పొంగులేటి

కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- ఈ నెలలోనే జాయినింగ్స్!

తమతోపాటు తమ అనుచరలకు టికెట్లు కేటాయిస్తే చేరేందుకు సిద్ధమని కాంగ్రెస్ అధిష్ఠానంతో చాలా రోజులుగా ఈ ఇద్దరి నేతలు చర్చలు జరుపుతున్నారు.ఇన్నాళ్లూ కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

కర్ణాటక ఎన్నికలతో మారిన సీన్,తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్ కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఆ పార్టీపై పాజిటివ్‌ ధోరణితో నేతలు ఉన్నట్టు అర్థమవుతోంది. తమతోపాటు తమ అనుచరలకు టికెట్లు కేటాయిస్తే చేరేందుకు సిద్ధమని కాంగ్రెస్ అధిష్ఠానంతో చాలా రోజులుగా ఈ ఇద్దరి నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ విషయంపై సుదీర్ఘ మంతనాలు జరిపిన కాంగ్రెస్ అధినాయకత్వం ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నెలలోనే చేరికలు అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ మూడో వారంలో కానీ నెలాఖరుకు కానీ జూపల్లి, పొంగులేటి చేరికలు ఉంటాయని అంటున్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అమెరికా టూర్‌లో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఓ డేట్‌ ఫిక్స్ చేసుకుంటారు. ఆ తర్వాత ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. టిక్కెట్ల కేటాయింపు విషయంలో హామీ ఇస్తే.. పార్టీ కండువా కప్పుకుంటామని మంతనాలు జరుపుతున్నారు. దీనిపై హామీ దొరికిన వెంటనే పార్టీలో చేరేందుకు ఓకే చెబుతున్నారు. ఇప్పుడు పొంగులేటి, జూపల్లి విషయంలో అదే జరిగిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.


బలమైన నేతలకు హామీ ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ ఒక ఎంపీ టిక్కెట్ మీద పోటీ చేయాలంటే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉండాలని షరతు పెడుతున్నారు. అలాంటి నేతలకుట టిక్కెట్లు ఇచ్చేందుకు రెడీగానే ఉన్నామంటూ హామీ ఇస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇటీవల నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. చాలా మందితో చర్చలు జరుపుతున్నారు.