ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర కొనసాగుతోంది. ఈ సాయంత్రం కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లిలో ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. 2019లో తమకు ఓట్లు వేసిన కైకలూరు ప్రజలను గుండెల్లో పెట్టుకున్నానంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడికి వస్తుంటే ప్రజలు దారిపొడవునా స్వాగతం పలికారని, వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. ఈ క్రమంలో ఆయన ఏపీ అధికార పక్షం వైసీపీపైనా, సీఎం జగన్ పైనా ధ్వజమెత్తారు. 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీల బలం ఉన్న పార్టీ వైసీపీ… ఏ పదవి లేని, కేవలం జనసైనికుల బలం ఉన్న పార్టీ జనసేన పార్టీ అని పవన్ ఉద్ఘాటించారు. తాము ఎవరికీ భయపడబోమని, ఇవాళ టీడీపీ వాళ్లకు కూడా మేమున్నాం అనే బలాన్ని అందించామని తెలిపారు. 

Previous articleతెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం… మెనూ ఇదే..!
Next articleలోకేశ్ ను కలవాలంటే తాడేపల్లి ప్యాలెస్ అనుమతి కావాలా?: దేవినేని ఉమ