పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు బుధవారం పెట్టే ప్రెస్మీట్లో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాయిన్ అవుతున్నారని టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ నెల 15న ఖమ్మంలో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీంట్లో కేంద్రహోంమంత్రి అమిత్షా పాల్గొననున్నారు. దానికి ఒక్క రోజు ముందే పొంగులేటి ప్రెస్ మీట్ పెట్టనున్నారు.తన అనుచరులు ఎవరూ ఆ పార్టీ వైపు మొగ్గు చూపకపోవడంతో పొంగులేటి ఆలోచించారు. ఎక్కువమంది కాంగ్రెస్వైపు మొగ్గు చూపుతుండటంతో బీజేపీలో చేరేందుకు నిరాకరించారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ అధినాయకత్వంతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో తన అనుచరులకు ఎక్కువ మందికి టికెట్స్ ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించినట్టు సమాచారం. పొంగులేటి కూడా ఈసారి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.