ఈరోజు చల్లపేట శ్రీ సంతోషి మాత కళ్యాణమండపం లో నియోజకవర్గ నాయకులు పనుతుల జయరామ్ గారి ఆధ్వర్యంలో క్రియాశీలక వాలంటీర్లకు మరియు జనసైనికులకు కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జయరామ్ మాట్లాడుతూ దేశ చరిత్ర లో ఎన్నడు లేని విధంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు ద్వారా కార్యకర్తలకు ఐదు లక్షల ప్రమాద బీమా కల్పించి తద్వారా వారి కుటుంబాల కు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారని తెలియపరచారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాయకులు సారవకోట జలుమురు నరసన్నపేట, పోలకి మండల నాయకులు సంతోష్, కిరణ్ శ్రీను,ధనుంజయ, చిరంజీవి మోషి, సురేష్, చందు మరియు జనసైనికులు మండల తదితరులు పాల్గొన్నారు