రాజకీయాలలో ఒకరినొకరు విమర్శించుకోవడం సహజం. అయితే అవి ఈ మధ్య తీవ్రస్థాయిలో ఉంటున్నాయి. వివరాల్లోకి వెళ్తే ఏపీ సీఎం జగన్ పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అబద్దపు ప్రచారాలతో లబ్ది పొందటం జగన్ నైజమని , అది అతని
డీఎన్ఏలోనే ఉందని , జగన్ బతుకే ఓ ఫేక్ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. తప్పుడు ప్రచారంతో, అవాస్తవాలతో రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం, నీచమైన తీరు వారి డీఎన్ఏలోనే ఉందని ఆరోపించారు. పెన్షన్లు పంచవద్దని తెలుగుదేశం పార్టీ ఎక్కడా అభ్యంతరం చెప్పలేదని పేర్కొన్నారు. ఇక పెన్షన్ విషయానికి వస్తే ఇంటింటికీ ఇవ్వద్దని ఎన్నికల సంఘం కూడా ఎక్కడా ఆదేశించలేదన్నారు .పెన్షన్ల విషయంలో పెద్ద రాజకీయ కుట్ర జరుగుతోందని బాబు పేర్కొన్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం వృద్ధులు, వికలాంగులను కూడా ఇబ్బందులు పెట్టే పాలకులు మనకు అవసరం లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి కుట్రలు చేస్తున్న దుర్మార్గులకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. రాజకీయాలను ప్రజలు ఎండగట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి రాగానే పెన్షన్‌ను 4 వేలకు పెంచుతామని ,, ఆంక్షలు ఎత్తేసి ఇంటివద్దే పెన్షన్ అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.