ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అధికార నివాసాన్ని సందర్శించారు. ఈ భవనం తుగ్లక్ రోడ్ లో ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 20 ఏళ్ల పాటు ఈ అధికార నివాసంలో ఉన్నారు. సీఎం పదవిని కోల్పోయిన కేసీఆర్ అధికార నివాసాన్ని ఖాళీ చేశారు. సీఎంగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారి ఈ నివాసానికి వచ్చారు. అంతకు ముందు ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే రేవంత్ తొలుత ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో పీఏసీలో చర్చించిన అంశాల గురించి ఆయనకు వివరించారు.