కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి అంశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తమ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరు అనేది గెలిచిన తర్వాత అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 80 నుంచి 85 సీట్లు కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసిఫాబాద్‌లో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి చేతకాక ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంట్ కొనుగోలు చేస్తున్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు. సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం చేతగాక, తమపై అసత్య ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు.