తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ రోజు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఏపీ రాజకీయాలపై పవన్ చర్చించనున్నట్లు సమాచారం. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో పవన్ పాల్గొనడం, బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలను కలసి వచ్చిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.గతంలో చంద్రబాబు, పవన్ మూడు సార్లు సమావేశమయ్యారు. ఒకసారి విజయవాడ, రెండుసార్లు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ మీటింగ్‌ కీలకం కానుంది. ఢిల్లీ పరిణామాలపై ప్రధానంగా ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.మరోవైపు వాలంటీర్ల వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలు, ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ విచారణ, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు తదితర అంశాలపై వీరు చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Previous articleవివేకానంద నగర్ డివిజన్ దీనబంధు కాలనీ బోనాల పండుగలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్
Next article13 నెలల తర్వాత రాజ్‌ భవన్‌కు వచ్చిన సీఎం కేసీఆర్