బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేశారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆయన తెలంగాణ భవన్‌లో వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారితో కాసేపు ముచ్చటించి… ఆ తర్వాత క‌లిసి భోజ‌నం చేశారు. కార్మికుల‌తో సెల్ఫీలు దిగారు. ఈ కార్య‌క్ర‌మంలో జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా… కేటీఆర్‌ను ప‌లువురు బీఆర్ఎస్ ప్రజాప్ర‌తినిధులు, నేత‌లు, కార్య‌క‌ర్త‌లు క‌లిసి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు.