రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అసలు ఈడీ అధికారాలేంటి..? ఈడీ కి అంత పవర్ ఉందా..? CBI, IT ఇతర సంస్థల కంటే ఈడీ ఎందుకింత పవర్ ఫుల్..! అసలు ఈడీ అధికారాలేంటి..? ఈడీ కేసు నమోదైతే జైలుకు వెళ్లాల్సిందేనా.. ? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈడీ చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏపీ, తెలంగాణ, ఢిల్లీ రాజకీయ నాయకులను కుదిపేస్తోంది. నేతలకు వరుసగా నోటీసులు ఇచ్చి ఈడీ విచారణ కొనసాగిస్తోంది. సాధారణంగా రాజకీయ నాయకులు ఏ కేసులకు అంతగా భయపడరు . కానీ ఈడీ అనగానే కాస్త వెనకడుగు వేయటం ఖాయం. ఈడీ పేరు చెప్పగానే ప్రముఖ వ్యక్తులు అయినప్పటికీ వణికిపోతుంటారు. ఈడీ అంటే చాలామందికి తెలియక పోవచ్చు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నే షార్ట్ కట్ లో ఈడీ అని పిలుస్తారు . ఇది ముఖ్యంగా రెండు చట్టాలపై పని చేస్తుంది. ఒకటి Foregin Exchange Management Act-1999. ఇది సివిల్ చట్టం. ఈ చట్టంలో ఫారెన్ ఎక్సేంజ్ కరెన్సీలో అవకతవకలు జరిగితే కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంటారు. రెండోది prevention oF money Laundering Act-2002. ఇది క్రిమినల్ చట్టం. ఇందులో చట్టబద్ధంగా కాకుండా అక్రమంగా మనీ సంపాదించి.. చట్టానికి దొరకకుండా తప్పించుకుంటూ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునే వారిని టార్గెట్ చేస్తారు. అలా అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని జప్తు చేసి ప్రభుత్వానికి అప్పజెప్పడం చేయడం ఈడీ మెయిన్ డ్యూటీ. PMLA ప్రకారం ఈడీకి 3 సూపర్ పవర్స్ ఉన్నాయి. నెంబర్ వన్ కోర్టు పర్మిషన్ లేకుండానే చేయవచ్చు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా దేశంలో ఎవరి ఇంట్లో, ఆఫీస్ లో నైనా రైడ్స్ చేయవచ్చు. ఈ అధికారం దేశంలో మరే ఏజెన్సీకి లేదు. నెంబర్ 2 CBI గానీ, ఇతర పోలీసుస్ డిపార్ట్ మెంట్స్ గానీ విచారణలో ఉన్నవారితో స్టేట్మెంట్స్ తీసుకుంటారు. అయితే ఇండియన్ evidence ACT ప్రకారం ఆ స్టేట్ మెంట్స్ ను కోర్టులో సాక్ష్యాలుగా పరిగణించరు. అంటే.. నిందితులు చెప్పిన స్టేట్ మెంట్ కు మళ్లీ పోలీసులు సాక్ష్యాలు చూపించాల్సి ఉంటుంది. కానీ ఈడీకి అలా కాదు. PMLA సెక్షన్ 50 అండర్2 ప్రకారం.. ఈడీ ఎవరి స్టేట్మెంట్ ఐన రికార్డు చేస్తే , అది కోర్టులో సాక్ష్యంగా తీసుకుంటారు. ఒకవేళ.. ఆ వ్యక్తి తప్పుడు స్టేట్ మెంట్ ఇస్తే మళ్లీ అతడి మీదే చర్యలు తీసుకుంటారు తప్ప ఈడీ అధికారులకు దీనితో ఏ సంబంధం ఉండదు. ఇక మూడోది సాధారణంగా చట్టం ఏం చెబుతోంది… నేరం రుజువు కానంత వరకు ఎవరైనా నిర్దోషిగా ఉంటారు..! అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి ఒకరిని హత్య చేశాడు అని కేసు నమోదు చేస్తే..,పోలీసులు, ప్రాసిక్యూషన్ అది ఆ వ్యక్తే చంపాడు అని సాక్ష్యాలన్ని కోర్టు ముందు పెట్టేవరకు అతను అమాయకుడే. కానీ సాక్ష్యాలు సంపాదించడానికి మాత్రం పోలీసులు చాలా ఇబ్బందులుపడాల్సి ఉంటుంది .,అయితే ఈడీకి ఏ ఇబ్బంది లేదు. విచారణలో ఉన్న వ్యక్తే నిర్దోషి అని నిరూపించుకునే వరకు దోషీగానే పరిగణించబడతాడు . ఉదాహరణకు ఒక వ్యక్తి అక్రమంగా 10 కోట్ల రూపాయలు సంపాదించారనే ఆరోపణలు వచ్చాయనుకోండి..,ఆ వ్యక్తి నా దగ్గర 5 కోట్లే ఉన్నాయి.,అవి కూడా సక్రమంగా సంపాదించాను అని తనే నిరూపించుకోవాలి., లేకపోతే.,తప్పు చేసినట్లే లెక్క. ఇక్కడ తాను నిర్దోషి అని నిరూపించుకునే బాధ్యత.,బరువు ఆ వ్యక్తి పైనే ఉంటుంది. అందుకే ఈడీకి అనవసరమైన తలనొప్పి ఉండదు. .అందుకే ఈడీ మోపే ఆరోపణలకు సవాల్ చేస్తూ నిర్దోషి అని నిరూపించుకోవడానికి ఒక వ్యక్తికి తల ప్రాణం తోకలోకి వస్తుంది. ఈడీకి ఉన్న ఈ పవర్స్ వల్లే ఈడీ మోపే కేసులంటే రాజకీయ నేతలే కాదు ఏ ఇతర.,రంగాలకు చెందిన సెలబ్రిటీలైన భయపడుతుంటారు. ,అందుకే.. ఈ మధ్య కాలంలో CBI కంటే ఈడీ పైనే ఫోకస్ ఎక్కువైంది.