బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు ఐదు గంటలుగా కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆమె సెల్ ఫోన్లకు కూడా ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఆ తర్వాత గత పదేళ్లలో ఆర్థిక లావాదేవీలపై ఆమెను ప్రశ్నించారు. కవిత లీగల్ టీమ్ ఆమె నివాసం వద్దకు వచ్చినప్పటికీ… వారిని ఈడీ అధికారులు అనుమతించలేదు. 

ఈ క్రమంలో కవితకు అరెస్ట్ వారెంట్ వారెంట్ ఇచ్చిన ఈడీ అధికారులు… ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ అంశంపై కాసేపట్లో ఈడీ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కవిత నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒకవేళ కవితను అరెస్ట్ చేసి ఇంటి నుంచి బయటకు తీసుకొస్తే… ఆమెను నేరుగా ఢిల్లీకి తరలించే అవకాశం ఉంది.