ప్రజాపాలన ముగిసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంపై నేడు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11.00 గంటలకు సీఎం అధ్యక్షతన జరగనున్న సమావేశంలో మంత్రులు కూడా పాల్గొంటారు. అయితే, ఇది అధికారిక మంత్రివర్గ సమావేశం కాదని, అందుబాటులో ఉన్న మంత్రులు ఈ సమావేశానికి హాజరుకావాలని కోరినట్టు తెలుస్తోంది. 

ప్రజాపాలన సాగిన తీరుపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. ప్రజలు ఎక్కువగా ఏ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు? వాటి అమలు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తదితరాలపై చర్చించనున్నారు. దరఖాస్తుల డిజిటలీకరణ, ప్రాసెసింగ్‌కు అవసరమైన నిధుల సమీకరణ వంటివాటిపై కూడా ఈ సమావేశంలో దృష్టి సారిస్తారు.