శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు. 

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొందరు వాలంటీర్లు వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డితో కుమ్మక్కై అరాచకాలు, ఆగడాలు చేస్తున్నారని తెలిపారు. అయితే, ప్రభుత్వ నిబంధనలు, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన వాలంటీర్లపై బొజ్జల సుధీర్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతం అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లను కొనసాగించడంతో పాటు వారికి మెరుగైన జీతభత్యాలు, సదుపాయాలు కల్పిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారని, తెలుగుదేశం పార్టీ వైఖరి ఇదేనని ఉద్ఘాటించారు.