ఇప్పటికే తిరుపతిలో ‘ఆదిపురుష్’ ఈవెంట్ను భారీ స్థాయిలో నిర్వహించటానికి తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. తాజాగా సినిమా యూనిట్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు ప్రకటించారు.సినిమాపై ఓ ఆధ్యాత్మిక భావనను క్రియేట్ చేయటంలో భాగంగా చిన్న జీయర్ను ఆహ్వానించగా ఆయన కూడా వస్తానని చెప్పారు. 200 సింగర్స్, 200 డాన్సర్తో స్పెషల్ ప్రోగ్సామ్స్ను ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేకంగా తయారు చేసిన క్రాకర్స్ను కాల్చబోతున్నారని, వాటిని కాల్చినప్పుడు జై శ్రీరాం అనే శబ్దం రావటమే దాని ప్రత్యేకత అని అంటున్నారు. అలాగే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రెండు ట్రైలర్స్ వచ్చాయి. అది కాకుండా మూడో ట్రైలర్ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. రామాయణంలోని యాక్షన్ సన్నివేశాలపై ప్రధానంగా ఈ ట్రైలర్ ఉండబోతుందని సినీ సర్కిల్స్ అంటున్నాయి. రీసెంట్గా విడుదలైన జై శ్రీరాం పాటతో పాటు ట్రైలర్ (AdiPurush Trailer) వల్ల సినిమాపై మంచి ఎఫెక్ట్ క్రియేట్ అయ్యింది.