తెలుగు రాష్ట్రాల్లో బెంగళూరు రేవ్ పార్టీ కేసు సంచలనం సృష్టించింది. ఇందులో సినీ నటి హేమ పట్టుబడ్డారు. అయితే తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదని వీడియోలు చేస్తూ అందరినీ బుకాయించే ప్రయత్నం చేసింది. దీనితో మండిపడ్డ బెంగుళూరు పోలీసులు ఆమె ఫోటోలు మీడియా కు రిలీజ్ చేశారు. ప్రస్తుతం హేమ బెంగుళూరు పోలీసుల అదుపులో ఉంది. అయితే ఈ అంశంలో బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన సినీ నటి హేమను ‘మా’ సస్పెండ్ చేసింది. పోలీసుల నివేదికలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. హేమను సస్పెండ్ చేసే విషయం పై గురువారం సుదీర్ఘంగా చర్చించి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు విష్ణు ప్రకటించారు. ఈ మేరకు ‘మా’ సభ్యులకు సమాచారం అందించారు. అయితే .డ్రగ్స్ కేసుపై వివరణ ఇవ్వాలని హేమకు నోటీసు ఇచ్చినా తను స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విష్ణు తెలిపారు. హేమకు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారని ‘మా’ సెక్రటరీ రఘుబాబు తెలిపారు. డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చిందన్నారు. అందుకే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మా అసోసియేషన్ నుంచి హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని . తదుపరి నోటీసు ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి వచ్చే వరకు సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.