శేరిలింగంపల్లి గచ్చిబౌలి పవర్ ఆఫ్ జర్నలిజం న్యూస్ ; గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ కాలనీకి చెందిన బేరి రామచంద్ర యాదవ్
ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుల గణన మరియు బీసీ సమస్యలపై జరిగే జాతీయ కన్వెన్షన్ కు పూర్తి మద్దతు ప్రకటించారు. జులై 15 2023 వ తేదీన రవీంద్ర భారతి లో జరిగే జాతీయ కన్వెన్షన్ కు యువత అంతా పాల్గొనాల్సిందిగా భేరి రామచందర్ యాదవ్ తెలియజేశారు. దేశవ్యాప్తంగా కుల గణన జరగాలని బీసీ సమస్యలపై పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు కిరణ్ కుమార్, కొండల్, శ్రావణ్ కుమార్, కావటి చంద్రశేఖర్ యాదవ్, వెంకటేష్, శివ యాదవ్, మల్లేష్ తో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ యొక్క గోడపత్రికను భేరి రామచందర్ యాదవ్  ఆవిష్కరించారు.