టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో ప‌ర్య‌టిస్తున్నారు. రెండో రోజు కుప్పం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌తో క‌లిసి చంద్ర‌బాబు ఇంటింటికీ వెళ్లి స్థానిక ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకోవ‌డం జ‌రిగింది. త‌మ స‌మ‌స్య‌ల‌ను పేర్కొంటూ వారు ఇచ్చిన విన‌తుల‌ను స్వీక‌రించారు. 

చంద్ర‌బాబుకు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికిన స్థానికులు, ఈసారి కుప్పంలో ల‌క్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. రెండు నెల‌ల్లో టీడీపీ ప్ర‌భుత్వం చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని, ఆ త‌ర్వాత చేప‌ట్ట‌బోయే అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను చంద్ర‌బాబు స్థానికుల‌కు వివ‌రించ‌డం జ‌రిగింది