జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దైవబలం కోసం హోమం చేస్తున్నారు . మరో ఐదు , ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. దీంతో జనసేన అధినేత పవన్ సైతం ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జూన్ 14 నుండి వారాహి యాత్ర మొదలుపెట్టబోతున్నారు. తన యాత్రకు దైవబలం కూడా తోడయ్యేందుకు హోమం నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈరోజున మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో హోమాన్ని నిర్వహించారు .