స్కిల్ డెవలప్‌మెంట్ కేసు దర్యాప్తులో ఉండగా మీడియా సమావేశాలు పెట్టారంటూ ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌‌ను హైకోర్టు విచారించింది. కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో మీడియా సమావేశాలు పెట్టి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని, ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వలేదని, కాబట్టి ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డిపై చర్యలకు ఆదేశించాలంటూ సత్యనారాయణ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. దీనికి స్పందించిన న్యాయస్థానం.. కోర్టు అనుమతితో మరోమారు ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించి ఎంత ప్రజాధనం వృథా అయిందో తెలపాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

Previous articleకాంగ్రెస్ భుజం మీద గొడ్డలి ఉంది.. అవకాశం ఇస్తే వేటు వేస్తారు…కేసీఆర్
Next articleఖమ్మంలో తుమ్మలను, పాలేరులో నన్ను ఓడించేందుకు కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నారు